Tuesday, 10 February 2026 04:00:05 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

Date : 09 February 2026 07:11 PM Views : 15

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు... అధికారులదే బాధ్యత అని హెచ్చరిక క్షేత్రస్థాయిలో పర్యటించి పాలన అమలును పరిశీలించాలని మంత్రులకు సూచన గత ప్రభుత్వ అప్పుల వల్ల అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని వెల్లడి త్వరలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకురానున్నట్లు ప్రకటన వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టాలని, హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యం పాలైతే సంబంధిత జిల్లా కలెక్టర్లు, మంత్రులనే బాధ్యుల్ని చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వ పాలసీలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలసీలు సమర్థవంతంగా అమలైతేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్రం 14 శాతం అధిక వడ్డీతో అప్పులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను గాడిలో పెట్టి, రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ పెంచడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నామని వివరించారు. ప్రతి ఐదేళ్లకు జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. జూలై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసులకు హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేయాలని, 5 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. గర్భిణుల్లో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా అవగాహన కల్పించాలన్నారు. మాతాశిశు సంరక్షణ కోసం 'కేర్ అండ్ గ్రో' కార్యక్రమాన్ని, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలని చెప్పారు. రాష్ట్ర జనాభా నిర్వహణ కోసం మార్చి నాటికి 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ' తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యారంగంలో ఒత్తిడి లేని విద్యావిధానం అమలు చేయాలని, పదో తరగతి ఫలితాల్లో మెరుగుదలకు 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరగకూడదని, నూతన ఆవిష్కరణలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు. నీటి సంరక్షణ, అభివృద్ధిపై కీలక సూచనలు రాష్ట్రంలోని 38 వేలకు పైగా ఉన్న చిన్న నీటిపారుదల చెరువులను పరిరక్షించాలని, భూగర్భ జలాలను 'నీటి బ్యాంకు' తరహాలో వాడాలని సూచించారు. పారిశ్రామిక కాలుష్యంతో జలాలు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు, ఏలూరు సమీపంలో కోకో సిటీ ఏర్పాటు వంటి వినూత్న ప్రాజెక్టులకు అవకాశాలున్నాయని, వీటిని ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :