Thursday, 22 May 2025 04:08:48 PM
# 53 లక్షల చ.అ. విస్తీర్ణంతో సచివాలయం అవసరమా?: జగన్ # కారు వెనుక నక్కి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరే యత్నం.. వ్యక్తి అరెస్టు # రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే

Snacks Scam: తిరుపతి కార్పొరేషన్ లో రూ.3 కోట్ల స్నాక్స్ స్కామ్ జరిగింది: కిరణ్ రాయల్

Date : 04 August 2024 04:10 PM Views : 136

Studio18 News - ANDHRA PRADESH / : తిరుపతి నగర పాలక సంస్థలో రూ.3 కోట్ల స్నాక్స్ స్కామ్ జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ కుంభకోణం జరిగినట్టు వైసీపీ కార్పొరేటర్లే నిర్ధారించారని వెల్లడించారు. "మనం మామూలుగా ల్యాండ్ స్కామ్, మైన్స్ స్కామ్ ఇలాంటి చూశాం... కానీ ఇక్కడ స్నాక్స్ స్కామ్ జరిగింది. ఇలాంటి స్కామ్ మొదటిసారి చూస్తున్నాం. తిరుపతి కార్పొరేషన్ లో అంతా కలిపి 150 మంది ఉంటారు. వారికి అందించే స్నాక్స్ ప్యాకెట్లో ఒక సమోసా, కొన్ని జీడిపప్పులు, కొంత మిక్చర్, ఒక బిస్కెట్ ఉన్నాయి. ఒక చిన్న కప్పులో టీ ఇస్తారు. దీనికి మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి గత ప్రభుత్వంలో వైసీపీ కార్పొరేటర్లే బహిరంగంగా చెప్పారు. ఆ టీలో ఏమైనా బంగారు పూత పూసి ఇచ్చారా...? అన్ని స్కాములు అయిపోయి ఆఖరికి మిక్చర్, సమోసా స్కామ్ కూడా చేశారు. మున్సిపాలిటీ అధికారులేమో రూ.3 కోట్లు కాదు... రూ.38 లక్షలకే తిన్నాం అంటారు, మరో అధికారేమో రూ.1.50 కోట్లకే తిన్నాం అంటారు. స్వయానా వైసీపీ కార్పొరేటర్లే బయటికి వచ్చి రూ.3 కోట్ల స్నాక్స్ అని చెప్పారు" అని వివరించారు. ఇక కార్పొరేషన్ పరిధిలో 90 మంది ఉద్యోగులను నియమించి, వారికి 25 నెలల పాటు జీతాలు చెల్లించినట్టు రికార్డులు తయారుచేశారని, ఆ నిధులను మళ్లించారని కిరణ్ రాయల్ ఆరోపించారు. "ఆ ఉద్యోగులందరూ ఎక్కడున్నారో తెలుసా...? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, డీఈలు, ఏఈలు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే అధికారుల ఇళ్లల్లో ఇద్దరు చొప్పున పనివాళ్లు ఉన్నారు. వాళ్లతో ఇళ్లలో పనులు చేయించుకుని ప్రభుత్వ డబ్బు జీతాలుగా ఇచ్చారు. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు... ప్రజల డబ్బుతో జల్సాలు చేశారు" అంటూ కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. అంతేకాదు, గతంలో రూ.2 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన డబుల్ డెకర్ బస్సులను కూడా మూలనపడేశారని మండిపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :