Thursday, 22 May 2025 03:57:38 PM
# రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక

Atchutapuram SEZ accident: కేజీహెచ్ వద్ద హృదయ విదారక పరిస్థితులు.. గుండెలవిసేలా రోదన

Date : 22 August 2024 12:26 PM Views : 131

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్‌ పేలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. కేజీహెచ్ వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. అక్కడి మార్చురీ వద్ద మృతుల బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కేజీహెచ్‌లో మొత్తం 12 మృతదేహాలు ఉన్నాయి. మృతులపై కనీసం సమాచారం ఇవ్వడంలేదని, మృతదేహాలను కనీసం చూడనివ్వడం లేదని బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. మార్చురీ వద్దకు కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. సాల్వెంట్ లీకేజీ వల్ల ప్రమాదం సంభవించి అగ్నికీలలు వ్యాపించాయని ఆయన చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే, గాయాలపాలైనవారికి.. తీవ్రతను బట్టి పరిహారం అందుతుందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. ప్రమాదం గురించి అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. కాగా, ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :