Monday, 24 March 2025 05:35:58 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

ఆ బిర్యానీ తినడం వల్లే ఈ దారుణం, వారికి హోంమంత్రి అనిత సీరియస్ వార్నింగ్

Date : 20 August 2024 10:28 AM Views : 52

Studio18 News - ANDHRA PRADESH / : Home Minister Vangalapudi Anitha : ఫుడ్ పాయిజన్ తో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న పిల్లలను ఏపీ హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు పరామర్శించారు. 92 మంది పిల్లల ఉండగా వారిలో 82 మందికి అస్వస్థత గురయ్యారని.. ముగ్గురు చనిపోయారని, కేజీహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి అనిత తెలిపారు. శనివారం పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళని పంపేశారని వెల్లడించారు. అందరూ చాలా చిన్న పిల్లలని, ఈ ఘటన చాలా బాధాకరం అని మంత్రి అనిత వాపోయారు. పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని వల్ల ఇంతటి ఘోరం జరిగిందని, పాస్టర్ కిరణ్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని మంత్రి అనిత తెలిపారు. ప్రభుత్వ పరంగా మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించామన్నారు. బయట ఫంక్షన్ నుండి తెచ్చిన ఆహారం తినడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని ఆమె చెప్పారు. అసలు ఫుడ్ ఎవరు పంపారు? సమోసాలు ఎవరు తెచ్చారు? అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. మతపరమైన బోధనలు చేసి తల్లిదండ్రులను మోటివ్ చేసి ఇలాంటి చోటుకి తీసుకొస్తారని మండిపడ్డారు. ఇలాంటి హాస్టల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా క్లోజ్ చెయ్యాలన్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో అలాంటివి రెండు ఉన్నట్లు గుర్తించామని, వెంటనే వాటిని మూసేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి అనిత చెప్పారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్.. ”కేజీహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 8 మంది ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. మరో 24 గంటలు పర్యవేక్షణ చేయాల్సి ఉంది”.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :