Monday, 17 March 2025 10:45:40 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా

గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు

Date : 30 December 2024 02:01 AM Views : 85

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అక్కడ టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారిమెట్టు దగ్గర రోజూ 3 వేల టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ..ఇక్కడే దళారుల దందా మొదలవుతుంది అనేది భక్తుల ఆరోపణ.. కొందరు ఆటో డ్రైవర్లు.. తాము తీసుకువస్తున్న భక్తులకు సమయం తర్వాత వచ్చినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్న వారిని కాదని.. దొడ్డిదారిన ఆటోవాలాలతో డీల్‌ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్‌ చేయడంలోనూ, క్యూలైన్‌లలో ఏర్పాట్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో, ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై నిలదీసినా తమకు సరైన సమాధానం రావడం లేదనేది భక్తుల మాట. వీకెండ్‌లు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. శ్రీవారి మెట్టుమార్గం మీదుగా కొండకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. తెల్లవారుజామునుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని నిరీక్షించినా ముందు వచ్చిన వారిని కాదని.. ఆటోల్లో వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దళారులతో ఎదురయ్యే ఇబ్బందులు ఇలా ఉంటే.. అటు తిరుమల కొండపై రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.. క్యూలైన్‌ MBC వరకు ఉంటోంది. శనివారం శ్రీవారిని 78 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 45 లక్షలు ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :