Wednesday, 18 June 2025 07:30:24 PM
# అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు! # భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు # విమాన ప్రమాదంలో మృతి చెందిన విజయ్ రూపానీకి నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు # ఇరాన్ ప్రకటనను ఖండించిన పాక్ రక్షణ మంత్రి # ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న జిల్లా కలెక్టర్ కు రేవంత్ రెడ్డి అభినందనలు # ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కండక్టర్‌ లేకుండానే బయల్దేరిన బస్సు.. చివ‌రికి! # చిరుతపులిని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ చూసి ఉండరు! # బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు # ఆ ప్రముఖ క్రికెటర్ చెప్పిన మాట వినుంటే... కరుణ్ నాయర్ కెరీర్ ముగిసేదేమో! # ఖతర్‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు సహా 11 మంది అరెస్ట్ # టమాటా రైతును కోలుకోలేని దెబ్బ తీస్తున్న 'ఊజీ ఈగ' # జామ్‌నగర్‌లో అక్రమ మత కట్టడం కూల్చివేత.. లోపల బయటపడ్డ విలాసాలు!

తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా

గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు

Date : 30 December 2024 02:01 AM Views : 150

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అక్కడ టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారిమెట్టు దగ్గర రోజూ 3 వేల టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ..ఇక్కడే దళారుల దందా మొదలవుతుంది అనేది భక్తుల ఆరోపణ.. కొందరు ఆటో డ్రైవర్లు.. తాము తీసుకువస్తున్న భక్తులకు సమయం తర్వాత వచ్చినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్న వారిని కాదని.. దొడ్డిదారిన ఆటోవాలాలతో డీల్‌ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్‌ చేయడంలోనూ, క్యూలైన్‌లలో ఏర్పాట్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో, ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై నిలదీసినా తమకు సరైన సమాధానం రావడం లేదనేది భక్తుల మాట. వీకెండ్‌లు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. శ్రీవారి మెట్టుమార్గం మీదుగా కొండకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. తెల్లవారుజామునుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని నిరీక్షించినా ముందు వచ్చిన వారిని కాదని.. ఆటోల్లో వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దళారులతో ఎదురయ్యే ఇబ్బందులు ఇలా ఉంటే.. అటు తిరుమల కొండపై రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.. క్యూలైన్‌ MBC వరకు ఉంటోంది. శనివారం శ్రీవారిని 78 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 45 లక్షలు ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :