Sunday, 08 March 2026 04:34:21 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Pothina Mahesh: అమ్మవారి సొమ్మును కొట్టేయడంలో బుద్దా వెంకన్నకు ఏఈ లక్ష్మణ్ సహకరిస్తున్నారు: పోతిన మహేశ్

Date : 14 September 2024 04:21 PM Views : 372

Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడ దుర్గా అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు పార్కింగ్, టోల్ ఫీజులు వసూలు చేస్తూ రూ. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేత పోతిన మహేశ్ ఆరోపించారు. కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దె పేరుతో మరింత కొట్టేయడానికి రెడీ అయ్యారని చెప్పారు. దీనికంతటికీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కారణమని అన్నారు. కాంట్రాక్టు పూర్తయిన తర్వాత మళ్లీ 10 శాతం పెంచి సదరు కాంట్రాక్టర్ కు కాంట్రాక్టు ఇవ్వాలని... కానీ, అలా చేయకుండా ఫ్రీగా టోల్ వసూలు చేసుకునేలా జీవో ఇచ్చారని అన్నారు. ఫ్రీగా వసూలు చేసుకున్న రూ. 2 కోట్లకు పైగా సొమ్మును కాంట్రాక్టర్ నుంచి ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీని ప్రారంభించారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే దోచుకో, దాచుకో, తినుకో అనే పరిస్థితి వస్తుందని జగన్ చెప్పారని అన్నారు. కనకదుర్గ నగర్ షాపుల ఏర్పాటులో కూడా బుద్దా వెంకన్న అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. వ్యాపారాలు సజావుగా సాగుతున్నా 49 శాతం అద్దెలు తగ్గించారని విమర్శించారు. ఒక్కో షాపుకు బుద్దా వెంకన్న రూ. 5 లక్షల చొప్పున లంచం తీసుకున్నారని చెప్పారు. మూడు నెలల్లో రూ. 4 కోట్లు వసూలు చేశారని అన్నారు. అమ్మవారి సొమ్మును కొట్టేయడంలో బుద్దా వెంకన్నకు ఏఈ లక్ష్మణ్ సహకరిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :