Sunday, 08 March 2026 10:54:45 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఉగ్రవాదుల జాడ లేకుండా భారత్‌ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి : పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు

పాకిస్తాన్‌ ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దాడుల పట్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పహల్గామ్‌ బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు.

Date : 08 May 2025 03:21 PM Views : 405

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అమరావతి : పాకిస్తాన్‌ ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దాడుల పట్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పహల్గామ్‌ బాధిత కుటుంబ సభ్యులు( Pahalgam victims ) స్పందించారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా , ఉగ్రవాదులు అనేవారు లేకుండా భారత్‌ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌( Operation Sindoor ) పై నెల్లూర్‌కు చెందిన మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఘటనలో మరణించిన మధుసూదన్‌రావు తల్లి పద్మావతి మాట్లాడుతూ నా కడుపు కోత ఏ తల్లికి రాకుండా ఉగ్రవాదులను అంతం చేయాలని అన్నారు. తమ కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారని కొడుకును తలుచుకుని రోధించారు. మధుసూదన్‌ సోదరి విజయలక్ష్మి , మధుసూదన్‌ మామ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం తమ కుటుంబానికి ఊరట కలిగిస్తోందని తెలిపారు. ఇప్పటికీ తమ సోదరుడి మరణం షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :