Wednesday, 25 June 2025 08:00:26 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

ఉగ్రవాదుల జాడ లేకుండా భారత్‌ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి : పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు

పాకిస్తాన్‌ ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దాడుల పట్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పహల్గామ్‌ బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు.

Date : 08 May 2025 03:21 PM Views : 55

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అమరావతి : పాకిస్తాన్‌ ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దాడుల పట్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పహల్గామ్‌ బాధిత కుటుంబ సభ్యులు( Pahalgam victims ) స్పందించారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా , ఉగ్రవాదులు అనేవారు లేకుండా భారత్‌ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌( Operation Sindoor ) పై నెల్లూర్‌కు చెందిన మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఘటనలో మరణించిన మధుసూదన్‌రావు తల్లి పద్మావతి మాట్లాడుతూ నా కడుపు కోత ఏ తల్లికి రాకుండా ఉగ్రవాదులను అంతం చేయాలని అన్నారు. తమ కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారని కొడుకును తలుచుకుని రోధించారు. మధుసూదన్‌ సోదరి విజయలక్ష్మి , మధుసూదన్‌ మామ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం తమ కుటుంబానికి ఊరట కలిగిస్తోందని తెలిపారు. ఇప్పటికీ తమ సోదరుడి మరణం షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :