Sunday, 08 March 2026 10:44:59 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఉమ్మడి విశాఖ జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్.. కూటమి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ

Date : 04 August 2024 10:34 AM Views : 374

Studio18 News - ANDHRA PRADESH / : Visakha MLC Election : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో విశాఖ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను పేరును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఖరారు చేశారు. అయితే, బొత్స సత్యనారాయణపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీచేసే అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి నుంచి రేసులో పీలా గోవింద్, గండి బాబ్జీ, పీవీజీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నేతలతో ఆ నియోజకవర్గం ఎంపీ సీఎం రమేశ్ భేటీ అయ్యారు. నేడు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు భేటీ కానున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని పోటీపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల లిస్ట్ ను పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకు పంపించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75 శాతం బలం ఉండగా, అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు… ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసనమండలి ఓటర్లే. ఐతే ఇలా పార్టీ మారిన ఓటర్ల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఓటర్లను నిలబెట్టుకోవడం వైసీపీకి సవాల్‌గా మారింది. బొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో వైసీపీ అధిష్టానం గెలుపుపై ధీమాతో ఉంది. కూటమి పార్టీల నేతలుసైతం విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను కూటమి వైపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలో నిలవనుండటంతో వైసీపీ ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల్లోకి వలసలు వెళ్లకుండా ఆపగలుగుతారని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వ్యూహాలను అధికారంలోని కూటమి ప్రభుత్వం ఏ మేరకు తిప్పికొడుతుందనే విషయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :