Thursday, 15 May 2025 02:20:20 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Pawan Kalyan: ఈ కార్యక్రమం పండుగలా జరగాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Date : 28 September 2024 10:55 AM Views : 85

Studio18 News - ANDHRA PRADESH / : అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని, 20వ తేదీ వరకూ వారం రోజుల పాటు పనుల ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించాలని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభం గురించి సమావేశంలో చర్చించారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన మొదటి వంద రోజుల్లోనే 15వ ఆర్ధిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.4500 కోట్ల నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిందని, దీంతో గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య లేదన్నారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ పనులు ప్రారంభించే కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఒక వేడుకలా ఈ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల గ్రామాల్లో తమకు వచ్చిన నిధులు, వాటితో చేసే పనులపై ప్రజలకు సమాచారం ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, తనిఖీలు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వెబ్ సైట్, డ్యాష్ బోర్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్. కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :