Monday, 17 February 2025 04:29:36 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

మేము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ- గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Date : 21 July 2024 04:59 PM Views : 96

Studio18 News - ANDHRA PRADESH / : Ganta Srinivasa Rao : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ అధినేత జగన్.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ హత్యలు, దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు జగన్. అంతేకాదు ఏపీలో శాంతిభద్రతలు లేనందున.. రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైసీపీ నుంచి అధికార పార్టీలోకి చేరికలు.. రాజకీయాలను మరింత వేడెక్కించాయి. విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒకేసారి 14మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొందరు కూడా త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చేరికల సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బాంబు పేల్చారు. తాము గేట్లు గెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని తెలిపారు. కార్పొరేటర్లు మాత్రమే కాదు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాస రావు చెప్పారు. విశాఖలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రవర్తన నచ్చకనే చాలామంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కేవలం కార్పొరేటర్లే కాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అటు కార్పొరేటర్లు పార్టీ మారడంతో వైసీపీకి మేయర్ పీఠం చేజారే అవకాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు