Monday, 23 June 2025 03:10:05 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

బుడమేరు, కొల్లేరులో అక్రమ నిర్మాణాలు తొలగించడానికి ఈ పని చేయిస్తాం: మంత్రి నిమ్మల

Date : 05 September 2024 12:23 PM Views : 123

Studio18 News - ANDHRA PRADESH / : Nimmala Rama Naidu: ఆంధ్రప్రదేశ్‌లోని బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరు, కొల్లేరులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి సర్వే చేయిస్తామని తెలిపారు. బుడమేరు వల్ల బెజవాడ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే బుడమేరుకు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. గడిచిన వైసీపీ ఐదేళ్ల పాలనలో బుడమేరుకు రూపాయి ఖర్చు పెట్టలేదు తట్ట మట్టి ఎత్తలేదని విమర్శించారు. కనీస నిర్వహణ ఉండుంటే ఈరోజు బెజవాడ వాసులకు బుడమేరు ముప్పు ఉండేది కాదని చెప్పారు. బుడమేరు కాలువకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూడుస్తున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు. నేటి సాయంత్రానికల్లా ప్రధానమైన ప్రాంతాల్లో పడిన గండ్లను పూర్తి చేస్తామని అన్నారు. రెండు, మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో పడిన గండ్లను పూడ్చటానికి సర్వేకంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. కాగా, దగ్గర ఉండి మరీ అక్కడి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :