Wednesday, 25 June 2025 06:56:20 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

రాసిపెట్టుకోండి... ఎవరినీ వదలం... మామూలుగా ఉండదు: మరోసారి జగన్ వార్నింగ్

Date : 08 May 2025 06:50 PM Views : 73

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అలాంటి పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని, 'జగన్ 2.0'లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... కేవలం వైసీపీని ప్రేమించినందుకు, అభిమానించినందుకు కార్యకర్తలు అనేక బాధలు పడుతున్నారని, వారి ఆవేదనను తాను చూస్తున్నానని అన్నారు. "మీ బాధలు చూస్తున్నాను. హామీ ఇస్తున్నాను. ఎవ్వరినీ వదలం. ఎక్కడున్నా సరే, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం" అని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, కొందరు పోలీసులు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో, రేపు అదే మొలకెత్తుతుందని జగన్ వ్యాఖ్యానించారు. "ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు ఆనాడు ఎక్కడున్నా, రిటైరైనా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మామూలుగా ఉండదు" అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడుతున్నారని, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. సంబంధం లేని వారిని కూడా కేసుల్లో ఇరికిస్తున్నారని, గతంలో ఇటువంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజల్లో చులకన అయ్యారని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని జగన్ విమర్శించారు. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే, ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా వెంటనే ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని, ఒకరోజు తిరుపతి లడ్డూ వివాదం, మరోరోజు సినీ నటి కేసు అంటూ ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం టీడీపీ వారికి లేదని, ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడంతో, పిల్లలు తమ రూ.15 వేలు, రైతులు రూ.26 వేలు, అవ్వలు రూ.48 వేలు, యువత రూ.36 వేలు ఏమయ్యాయని నిలదీస్తున్నారని, దీనికి సమాధానం చెప్పలేని దుస్థితిలో టీడీపీ ఉందని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేసి, నిర్వీర్యం చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :