Thursday, 12 March 2026 12:03:20 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Nagababu: వైసీపీ హిందూ ద్రోహి: నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

Date : 04 February 2026 07:14 PM Views : 50

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : వైసీపీని విమర్శిస్తూ వీడియో విడుదల చేసిన నాగబాబు వేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని మండిపాటు అంతర్వేది, రామతీర్థం తదితన ఘటనలను ప్రస్తావించిన వైనం వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధ్వంసం ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఘటన, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి... వేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు. ఏ మాఫియాను కాపాడటానికి ఇదంతా చేశావు జగన్? అని ప్రశ్నించారు. హిందువులపై కుతంత్రాలు చేయడం తప్ప వైసీపీ నేతలకు మరొకటి లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నాగబాబు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువుగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి... హిందూ దేవాలయాలపై లేదని విమర్శించారు. సినిమా రివ్యూలపై ఉన్న శ్రద్ధ... భగవంతుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే అవమానకరంగా మాట్లాడారని నాగబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ భార్య, కూతురు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని... అబ్దుల్ కలాం కంటే కూడా నీవు గొప్ప వ్యక్తివా? అని జగన్ పై మండిపడ్డారు. తిరుమల కొండతో పాటు ఇతర కొండలకు గుండు కొట్టాలని చూసింది నీవు కాదా? అని ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :