Wednesday, 30 April 2025 04:35:07 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

MPDO Venkata Ramana Case : నర్సాపురం ఎంపీడీవో ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సైబర్ నేరగాళ్లకోసం పోలీసుల వేట..

Date : 30 July 2024 02:47 PM Views : 115

Studio18 News - ANDHRA PRADESH / : MPDO Missing Incident : నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నాడనే మరొక వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ చేశారు. ఎంపీడీవోను బ్లాక్ మెయిల్ చేసిన కీలక నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ బర్కత్ పుర యువకుడిని గుర్తించి మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సింగణమల పోలీసుల అదుపులో సైబర్ నిందితుడు ఉన్నాడు. సింగణమల పోలీసు స్టేషన్ పరిధిలోని సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరించారు. ఒక కేసులో విచారణకోసం వెళ్లిన సమయంలో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వారిని కస్టడీకి తీసుకొని విచారణ జరిపించేదుకు కృష్ణా జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారు. 25 నుంచి 35 మంది వరకు గ్యాంగ్ సభ్యులు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసుల కదలికలను గుర్తించిన నేరగాళ్లు పరారయ్యారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలను బట్టిచూస్తే.. వెంకటరమణారావు సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈనెల 15న వెంకటరమణారావు మిస్సింగ్ పై ఆయన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వివాదానికి సంబంధించి గత అధికార పార్టీ నేతలే తన ఇబ్బందులకు కారణమని వెంకటరమణారావు తన కుమారుడికి లేఖ ద్వారా, వాట్సప్ లో సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన మిస్సింగ్ వ్యవహారం పొలిటిక్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో డ్రోన్ల సహాయంతో తీవ్రంగా గాలించారు. ఎనిమిది రోజుల తరువాత ఆయన మృతదేహం బయటపడింది. రమణారావు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎంపీడీవో ఆత్మహత్య వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడంతో వెంకటరమణారావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆయన్ను పలుమార్లు సైబర్ నేరగాళ్లు బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక సైబర్ నేరగాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగిలినవారికోసం గాలిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :