Sunday, 16 March 2025 04:09:43 PM
# Omar Abdullah: జమ్మూకశ్మీర్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా # AP Govt: ఏపీ స‌ర్కార్ ఆసక్తికర నిర్ణ‌యం... ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు! # Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి # Chegondi Harirama Jogaiah: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ # Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్ # Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌...? # Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన # Revanth Reddy: చంద్రశేఖర్ రావ్... నీ పిల్లలకు చెప్పు... మాట జారితే ఫలితం అనుభవిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ # దేశంలో కులగణన చేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న మాయావతి సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని వ్యాఖ్య # Sovereign Bonds: వారి పంట పండింది... రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ # మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా # త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ # విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం # కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య చంద్రబాబుని # వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ # Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే! # Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు # Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు # Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ # Chiranjeevi: తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు.. గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 29 August 2024 01:56 PM Views : 58

Studio18 News - ANDHRA PRADESH / : ganta srinivasa rao: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీలో చేరుతుండడంపై టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”వైసీపీ మునిగిపోయే నావ. ఈ విషయం ముందే చెప్పాను. రాజీనామా చేసి మా పార్టీలో చేరుతామంటే స్వాగతిస్తున్నాం. ఇప్పడు చేరుతున్న వారు రాజీనామా చేసి పార్టీ లో చేరుతున్నారు. విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల సమయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అభివృద్ధి దృష్ట్యా కొందరి చేరికలు పార్టీకి బలం చేకూరుతాయని స్పష్టం చేశాను. పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డిన”ని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కాగా, సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యులు మోవిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఇమడలేక ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని చంద్రబాబు తేల్చి చెప్పారు. కొంత మంది నాయకుల విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీ బలోపేతానికి అవసరమైన వారినే చేర్చుకుంటామన్నారు. ఎవరినిబడితే వారిని పార్టీలోకి తీసుకోవద్దని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్టానానికి సూచించారు. అధికారం కోసం వారిని చేర్చుకుంటే.. అధికారం లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని అవమానించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, అభివృద్ధి కోరుకుని, తమతో కలిసి పనిచేయడానికి వచ్చేవారికి ఆహ్వానం పలుకుతామని కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :