Studio18 News - ANDHRA PRADESH / : Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ నుండి ఓ వ్యక్తి క్యాన్ లో ఐదు లీటర్ల పెట్రోల్ కొట్టించుకొని తీసుకెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఓ దుకాణం వద్ద బైక్ ఆపి క్యాన్ ను బైక్ పక్కనే ఉంచాడు. అయితే, క్యాన్ పగిలిపోవడంతో పెట్రోల్ మొత్తం కిందపోయింది. రోడ్డుపై పడిపోయిన పెట్రోల్ ను చూసుకోకుండా.. షాపు వద్దనే నిలబడిన వ్యక్తి బీడీ కాల్చాడు. అనంతరం అగ్గిపుల్లను కిందపడేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు భయంతో పరుగు పెట్టారు. మంటలు తొలుత పక్కనే ఉన్న మోటార్ సైకిల్ కు వ్యాపించడంతో ఓ వ్యక్తి దానిని పక్కకు తొలగించి మంటలను ఆర్చేశాడు. పెద్దెత్తున మంటలు చెలరేగి చూస్తుండగానే రోడ్డుకు ఆనుకొని ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన దుకాణాల యాజమానులు, స్థానికులు నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మంటలు అదుపులోకి రావడంతో షాపు యాజమానులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. మంటలు వ్యాపించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Admin
Studio18 News