Sunday, 08 March 2026 10:24:06 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Chandrababu Naidu: జగన్ వెళ్తూ వెళ్తూ ఇలా చేసి వెళ్లారు: చంద్రబాబు

Date : 01 October 2024 05:13 PM Views : 449

Studio18 News - ANDHRA PRADESH / : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానాకు ఖాళీ చేసి వెళ్లారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడలో నిర్వహించిన గ్రామసభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారని ప్రజలను చంద్రబాబు అభినందించారు. ప్రజలు ఎక్కువ మంది కూటమి ఎంపీలకు గెలిపించి మంచి పని చేశారని అన్నారు. హంద్రీనీవా నీటిని అన్ని చెరువులకు ఇవ్వాలని భావించామని, గత ఐదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదని తెలిపారు. వైసీపీ సర్కారు చేసిన విధ్వంసం అంతాఇంతా కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు పరిశ్రమల యజమానులతో మాట్లాడుతున్నాం పెట్టుబడుల కోసం ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి చోట భూ సమస్యలు సృష్టించారని చెప్పారు. కాగా, అంతకు ముందు సీఎం చంద్రబాబుతో సచివాలయంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఇన్వస్టిగేషన్ ఏజన్సీస్ ఉన్నతాధికారులతోనూ కంబైన్డ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తీరుమలరావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, సీఐడీ ఛీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా సమావేశంలో పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :