Wednesday, 25 June 2025 07:55:57 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

Date : 31 July 2024 03:42 PM Views : 138

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అటవీశాఖ అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత పవన్... చంద్రబాబును కలిశారు. ఇరువురు పలు శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అంతకుముందు చంద్రబాబు... పరిశ్రమల శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల శాఖలో గత ఐదేళ్లుగా జరిగిన వ్యవహారాలపై చర్చించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు 2019 తర్వాత వెనక్కి వెళ్లారని అధికారులు వివరించారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించేందుకు వారితో తానే మాట్లాడతానని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భూముల లభ్యత, పారిశ్రామిక అనుకూల ప్రాంతాలపైనా ఈ సమీక్షలో చర్చించారు. ఆరోగ్యశ్రీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: మంత్రి కొలుసు పార్థసారథి ఆరోగ్యశ్రీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేసే పత్రికలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. బిల్లులు చెల్లించకపోవడంతో గతంలో అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన అసమర్థ పాలన జగన్ ది అని విమర్శించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. జలవనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు తాగు, సాగునీరు విడుదలపై చర్చించారు. కృష్ణా బోర్డుకు తెలిపి నీరు విడుదల చేయాలని మంత్రి నిమ్మల అధికారులకు నిర్దేశించారు. తొలుత తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి సారించిన మంత్రి నారాయణ ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి సారించారు. భవన నిర్మాణం, లేఅవుట్ల అనుమతుల జారీలో జాప్యం నివారించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ లోని పెండింగ్ దరఖాస్తులపై రేపు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొననున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :