Monday, 23 June 2025 03:23:37 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

VG Venkata Reddy: ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు

Date : 14 September 2024 03:10 PM Views : 166

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి కోసం ఏసీబీ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. గురువారం ఆయనపై కేసు నమోదు కాగా, అప్పటి నుంచి మూడు బృందాలు ఆయన కోసం వెతుకుతున్నాయి. ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులోనూ ఆయన కోసం గాలిస్తున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు చెన్నై, తిరుపతి, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, కొర్లకుంట తదితర గ్రామాల్లోని ఆయన నివాసాలతోపాటు రైల్వే కోడూరులోని ఆయన అత్తగారి ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక కాంట్రాక్టు, నిర్వహణలో రూ. 2,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. కేసు నమోదైన వెంటనే వెంకటరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గనుల శాఖలో ఆయన సన్నిహితులను ఏసీబీ విచారించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :