Wednesday, 26 March 2025 04:43:03 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

TTD: తిరుమలలో రోజుకు 3 లక్షల లడ్డూల తయారీ.. సరుకులు ఎలా కొంటారంటే..!

Date : 21 September 2024 02:12 PM Views : 143

Studio18 News - ANDHRA PRADESH / : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూలలో కల్తీపై రేగిన వివాదం భక్తులను ఆందోళన పరుస్తోంది. స్వామి వారి లడ్డూ అపవిత్రమైందని భక్తులు కలత చెందుతున్నారు. ఈ క్రమంలో తిరుమలలో శ్రీవారి ప్రసాదం లడ్డూను ఎలా తయారు చేస్తారు.. అవసరమైన పదార్థాలను ఎలా సేకరిస్తారు.. తదితర వివరాలు ఇదిగో.. తిరుమలలో సగటున రోజుకు 3 లక్షల లడ్డూలు తయారుచేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఏటా 6,100 టన్నుల నెయ్యి, 14 టన్నుల చక్కెర, 9,200 టన్నుల శనగ పప్పు, 4,680 టన్నుల మైసూర్ పప్పులతో పాటు సన్ ఫ్లవర్ ఆయిల్, బాదాం తదితర పదార్థాలను ఈ టెండర్ ద్వారా సేకరిస్తారు. అలిపిరి నుంచి తిరుపతి వరకు రెండు ఎకరాల్లో విస్తరించిన గోడౌన్లలో వీటిని నిల్వ చేస్తారు. వీటికోసం టీటీడీ ఏటా రూ.500 కోట్లు ఖర్చుచేస్తోంది. ఈ టెండర్.. లడ్డూల తయారీకి అవసరమైన పదార్థాలను సేకరించేందుకు ఈ టెండర్ ద్వారా సరఫరాదారులను ఎంపిక చేస్తారు. ఇందులో పాల్గొనాలంటే ఏపీ టెక్నలాజికల్ సర్వీసెస్ ధ్రువీకరించిన సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అగ్ మార్క్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరి. వివాదం ఇదీ.. లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనేది తాజా వివాదం.. టీటీడీ రోజూ తయారుచేసే 3 లక్షల లడ్డూల కోసం 1,400 కిలోల నెయ్యి ఉపయోగిస్తుంది. టీటీడీకి వచ్చే నెయ్యి ట్యాంకర్లను నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ లేబరేటరీస్ (ఎన్ఏబీఎల్) ముందుగా పరీక్షిస్తుంది. ఆ తర్వాతే ట్యాంకర్లు టీటీడీ గోడౌన్ కు చేరతాయి. ఇటీవల ఏఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సప్లై చేసిన 10 ట్యాంకర్లను టెస్టింగ్ అధికారులు ఆపేశారు. అందులో కల్తీ జరిగిందనే అనుమానంతో శాంపిల్స్ ను పరీక్షకు పంపించి, ట్యాంకర్లను పక్కన పెట్టారు. అయితే, ఏఆర్ డెయిరీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వివిద దశలలో పరీక్షించాకే టీటీడీకి నెయ్యి పంపించామని చెబుతోంది. టీటీడీకి సప్లై చేసే నెయ్యిలో తాము పంపించేది కేవలం 0.01 శాతం మాత్రమేనని వివరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :