Friday, 14 November 2025 03:16:42 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Vijayasai Reddy: టీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో మారుపేర్లతో చెలరేగిపోతున్నారు: విజయసాయిరెడ్డి

Date : 20 August 2024 04:17 PM Views : 180

Studio18 News - ANDHRA PRADESH / : టీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ సభ్యులు మారుపేర్లతో తమ ప్రత్యర్థులైన వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఇటువంటి ఉన్మాదుల అరాచకాలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. తన కులం వేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరు అయినా... ఇతర కులాల పేర్లను తగిలించుకుని... కులపిచ్చి, డబ్బు ఆశతో దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. "సాధారణంగా పేర్లను మార్చుకునేది ఎవరు? నేరస్తులు, ఉగ్రవాదులు తప్పుడు పేర్లతో చలామణీ అవడం చూస్తుంటాం. కులోన్మాదం, పచ్చ కామెర్లు సోకిన కొందరు టీడీపీ కోసం పేర్ల చివరన రెడ్డి, యాదవ్, గౌడ్ అని పెట్టుకుని... వారి యజమానులు చెప్పిన వారిపై అదే పనిగా బురద చల్లుతున్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరుకు బదులుగా మరో పేరుతో చలామణీ అవడం అంటే చచ్చిపోయిన వాళ్ల కింద లెక్క అని అర్థం చేసుకుంటే మంచిది" అని విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :