Studio18 News - ANDHRA PRADESH / : ఉమ్మడి విశౄఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపు ఖాయం కావడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. 'వైఎస్ఆర్సీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం!' అని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించిన విషయం తెలిసింది. బొత్సతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా పోటీలో ఉన్నారు.
Admin
Studio18 News