Thursday, 15 May 2025 01:46:43 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

gajjala venkata lakshmi: ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు

Date : 04 October 2024 11:43 AM Views : 86

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురయింది. తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను నిలుపుదల చేసి, ఆ పోస్టులో కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని వెంకటలక్ష్మి చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వెంకటలక్ష్మిని గత వైసీపీ ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చాలా మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వెంకటలక్ష్మి రాజీనామా చేయలేదు. దీంతో కూటమి సర్కార్ ఆమెను తొలగిస్తూ మెమో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా అంతకు ముందు పని చేసిన వాసిరెడ్డి పద్మ పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేశారని.. ఆమె స్థానంలో మిగిలిన కాలానికి వెంకటలక్ష్మి నియమితులయ్యారని, ఈ ఏడాది ఆగస్టు 25తో ఆ పదవీ కాలం ముగియడంతో ఆమెను తొలగించడం జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు .. వెంకటలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం నిర్ణయాన్ని వెలువరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :