Tuesday, 31 March 2026 04:31:37 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం

Date : 06 December 2025 06:49 PM Views : 242

Studio18 News - ANDHRA PRADESH / Kakinada : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం పిఠాపురం పట్టణం,యు.కొత్తపల్లి, గొల్లప్రోలులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైమన్ కమిటీ సభ్యులు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండె దొరబాబు, ఓదురి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి విద్యారంగంలో రాణించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ముందుగా పిఠాపురం ఆర్.ఆర్. బి.హెచ్.ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా పీటీఎం కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచి అలవాట్లు క్రమశిక్షణ నేర్చుకోవాలని తద్వారా మీరు చదివిన స్కూలుకి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులని ఒకచోట కలిపే ప్రయత్నం చేసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మధ్య సఖ్యత పెరుగుతుందని తెలిపారు.అదేవిధంగా పిఠాపురం పట్టణంలో ఉన్న విద్యార్థులకు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అందజేసిన క్రీడ కిట్లును ప్రతి ఒక్కరు వినియోగించుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండి ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైమన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండె దొరబాబు, ఓదురి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, మత్స్యకార నాయకులు,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :