Thursday, 12 March 2026 12:18:52 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Swathi Roja: ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను అభినందించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Date : 22 December 2025 08:41 PM Views : 232

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన జెన్ జెడ్ వ్లాగర్ స్వాతి రోజా ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న స్వాతికి పవన్ అభినందనలు శ్రీశైలంలో ఇబ్బందుల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాల ఏర్పాటు పవన్ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపిన యువ యాత్రికురాలు దేశవ్యాప్తంగా ఒంటరిగా బైక్‌పై ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న జెన్ జెడ్ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. సోమవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె పవన్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. స్వాతి చేస్తున్న సాహస యాత్ర వివరాలు అడిగి తెలుసుకుని, భవిష్యత్ ప్రయాణాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొన్ని వారాల క్రితం స్వాతి రోజా శ్రీశైలం సందర్శించారు. ఆ సమయంలో ఆమెకు వసతి, భద్రత పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి, ఆమెకు శ్రీశైలంతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం స్వాతి నేరుగా పవన్ కల్యాణ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశైలంలో తనకు ఎదురైన అనుభవాలను ఆమె పవన్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బైక్ రైడింగ్, మోటార్ సైకిళ్లపై తనకున్న ఆసక్తిని స్వాతితో పంచుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :