Tuesday, 18 March 2025 12:17:32 AM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి : మంత్రి సత్యప్రసాద్

Date : 12 August 2024 12:09 PM Views : 60

Studio18 News - ANDHRA PRADESH / : Minister Anagani Satya Prasad : వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పెద్దెత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారు. తప్పుచేసి తప్పించుకోవడం సాధ్యం కాదని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ లు తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మదనపల్లె ఫైళ్ళ దగ్థం కేసు విచారణ వేగంగా జరుగుతోందని చెప్పారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్ళలో భూములకు సంబంధించిన వందల ఫైళ్ళు దొరికాయి. మదనపల్లె ఫైళ్ళ దగ్థం కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బాధితులు ఉన్నారని, వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతామని అన్నారు. ప్రజా ధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. 24గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తామని చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని, ఒక్క మెగా వాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేదని చెప్పారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడంవల్ల గతంలో విద్యుత్ చార్జీల ధరలు పెరిగాయి. 6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు. నూతన విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ యోజన పథకాన్ని ఏ విధంగా అందించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వ్యక్తిగతం. మేమెక్కడా శ్రీనివాస్ ను విమర్శించడం లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్యనేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదు. వైసీపీ నేతలు మాపై బురదజల్లాలని చూస్తున్నారు. కేంద్రంలో మమ్మల్ని దోషులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :