Wednesday, 26 March 2025 05:30:30 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం.. నలిగిపోతున్న టెక్కలి వైసీపీ నేతలు..!

Date : 23 August 2024 10:45 AM Views : 141

Studio18 News - ANDHRA PRADESH / : Gossip Garage : వాణి.. మాధురి మధ్యలో దువ్వాడ శ్రీనివాస్. మొదట భార్యాభర్తల పంచాయితీ అనుకున్నారు. మాధురి ఎంట్రీతో.. పతి పత్ని ఔర్‌ ఏక్ లేడీ అన్నట్లుగా మారిపోయింది స్టోరీ. సీరియల్ ఎండింగ్‌లో.. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ ఉన్నట్లు.. చర్చలు, ఆస్తుల పంపకాలు అంటూ హడావుడి నడిచింది. అయినా దువ్వాడ ఫ్యామిలీ స్టోరీ కొలిక్కి రాలేదు. 20 రోజులుగా భార్య వాణి, కూతుర్లు హైందవి, నవీనలు దువ్వాడ కొత్త ఇంటి కార్ షెడ్‌లోనే నిరసన తెలుపుతున్నారు. దువ్వాడ శ్రీను, వాణి ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. శ్రీను-వాణి కుటుంబ పెద్దలు చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. ఈ వివాదం కాస్త హైకోర్టుకు చేరింది. సిక్కోలు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న దువ్వాడ శ్రీనివాస్ గెలుపోటములతో సంబంధం లేకుండా.. జగన్ మనస్సు గెలిచిన దువ్వాడ.. వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా.. ఎమ్మెల్సీ పదవిచ్చి దువ్వాడను గౌరవించారు జగన్. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీలక నేతగా ఉన్న దువ్వాడ శ్రీను.. ఇప్పుడు కుటుంబ వివాదంలో ఇరుక్కుని ..రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. దువ్వాడ ఇంటిపోరు టాక్‌ ఆఫ్‌ ది టూ స్టేట్స్‌గా మారిపోయింది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి ..వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇద్దరూ టెక్కలి నియోజకవర్గానికి ఇంచార్జులుగా కూడా పనిచేశారు. మరోవైపు దువ్వాడ శ్రీను -వాణి వివాదం రెండేళ్లుగా నడుస్తూ వస్తుంది. చాలాసార్లు వీళ్లిద్దరి పంచాయతీ వైసీపీ అధిష్టానం దగ్గరకు వెళ్లినా..పార్టీ పెద్దలు, స్వయంగా వైసీపీ అధినేత జగన్ చెప్పినా పరిష్కారం లభించలేదు. ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతున్నా జిల్లా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ధర్మాన సోదరులు గాని, తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మౌనంగానే ఉంటున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారంలో కూడా వైసీపీ సైలెన్స్‌గానే ఉంది. ఇప్పుడు దువ్వాడ వాణి డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటే పార్టీకి డ్యామేజ్‌తో పాటు.. బీసీ నేత కాబట్టి చర్యలు తీసుకున్నారన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీను, వాణి ఇద్దరు కీలక నేతలు కావడం ..ఇద్దరికి ఎవరి మాట వినే మనస్థత్వం లేకపోవడంతో పార్టీ నేతలు మాట్లాడినా పరిష్కారం లభించదని భావిస్తున్నారట. అందుకే కుటుంబ వివాదం కాస్త పార్టీకి అంటకుండా ఉంటే చాలని వైసీపీ అధిష్టానం అనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటి వివాదం వారే తెల్చుకోవాలని ఇందులో పార్టీ కలుగజేసుకోదంటున్నారట. మరోవైపు వాణి-శ్రీను-మాధురి వివాదంలో..టెక్కలి వైసీపీ నేతలు నలిగిపోతున్నారు. టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు హవా నడుస్తోంది. ఇలాంటి సందర్భంలో పార్టీకి.. కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు సొంత సమస్యలతో రోడ్డెక్కుతూ రచ్చ చేస్తుండటంపై ఆగ్రహం మీదున్నారు కేడర్. తమకు అండగా ఉండి నడిపించే నాయకులు లేరని మదనపడుతున్నారట. ఒకరి దగ్గరికి వెళ్తే మరొకరికి కోపం వస్తుందని.. ఆ ముగ్గురికి ఆమడ దూరంలో ఉండటమే బెటరని.. దువ్వాడ ఇంటి దరిదాపులకు కూడా వెళ్లడం లేదు వైసీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో దువ్వాడ ట్రైయాంగిల్ స్టోరీకి శుభం కార్డు ఎప్పుడు పడుతుందా అని అటు వైసీపీ పార్టీ పెద్దలు, అటు క్యాడర్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :