Thursday, 27 March 2025 01:05:14 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

Devineni Uma: ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్?: దేవినేని ఉమా

Date : 05 September 2024 04:10 PM Views : 59

Studio18 News - ANDHRA PRADESH / : టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఇవాళ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చడానికి విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాలు ఓదార్పు కార్యక్రమం చేశాడని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వం మీద విషం చిమ్మేందుకు కుట్రలు, కుతంత్రాలతో, నీచపు బుద్ధితో వచ్చాడని విమర్శించారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. బుడమేరు డైవర్షన్ కాలువ నుంచి 37,555 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కృష్ణా నదికి తరలించడానికి రూ.464 కోట్లతో చంద్రబాబు టెండర్లు పిలిపించారని, పనులు మొదలు పెట్టారని, దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు పెట్టారని దేవినేని ఉమా వెల్లడించారు. కానీ, ఐదేళ్ల వైసీపీ పాలనలో పనులు నిలుపుదల చేసి, ఇవాళ వరదలకు కారణమయ్యారు... ఈ దుర్మార్గానికి నువ్వు (జగన్) కారణం కాదా? అంటూ నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చు పెడితే, జగన్ పాలనలో రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టారు... బుడమేరు కాలువ పనులను ఎందుకు నిలుపుదల చేశావ్? అని ప్రశ్నించారు. ఇవాళ ఈ లక్షలాది మంది వరద బాధితులకు సమాధానం చెప్పు అని డిమాండ్ చేశారు. ఇంత నష్టం జరిగింది నీ తప్పుడు నిర్ణయాల వల్లే కాదా? నీ అహంకార పూరిత నిర్ణయాల వల్లే కాదా? నీ మూర్ఖపు నిర్ణయాల వల్లే కాదా? నీ రివర్స్ టెండరింగ్ ల వల్లే కాదా? ప్రజలు ఏం పాపం చేశారని జరిగే పనులను ఆపేశావ్? అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు మీద కేసు పెట్టండి, దేవినేని ఉమా మీద కేసు పెట్టండి అంటూ ఆ పనులు చేసే ఏజెన్సీలపై ఒత్తిడి తీసుకువచ్చే వారని ఉమా ఆరోపించారు. "బుడమేరు ఆక్రమణల కారణంగా వరద బీభత్సం సృష్టిస్తే... మొన్న వచ్చి పైశాచిక ఆనందం పొందేందుకు బురద చల్లుతావా? మళ్లీ నిన్న వచ్చి బురద చల్లావు... సిగ్గుందా నీకు? విజయవాడ కరకట్ట గోడలు నువ్వు నిర్మాణం చేశావా? చంద్రబాబు ప్రభుత్వం నాడు 2.3 కిలోమీటర్ల మేర కరకట్ట గోడ నిర్మించింది. వందల కోట్లతో ఆ నిర్మాణం చేపట్టాం. మీ ప్రభుత్వం రాగానే ఆ పనులు ఆపేశావు... టీడీపీ నేతలు ధర్నాలు చేస్తే మళ్లీ పనులు ప్రారంభించావు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నేను కట్టానని ముద్దులు పెట్టించుకుంటావా? ఆ గోడ దగ్గర తైతక్కలాడతావా? గత ప్రభుత్వాలు రిటైనింగ్ వాల్ గురించి పట్టించుకోకపోతే చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కానీ నువ్వు... అంతా నేనే కట్టానంటూ సొల్లు కబుర్లు చెబుతావా?" అంటూ ఉమా నిప్పులు చెరిగారు. ఇక, ప్రభుత్వ సహాయక చర్యల గురించి చెబుతూ... స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే జిల్లా కలెక్టరేట్ లో బస చేసి యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారని ఉమా వివరించారు. జేసీబీ పైనే 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్పారని వెల్లడించారు. పిల్లలకు పాలు దగ్గర్నుంచి, ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం వరకు... బుడమేర ముంపు బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి సహా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారని ఉమా తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :