Sunday, 15 March 2026 10:38:55 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Chandrababu Naidu: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం

Date : 30 September 2025 07:24 PM Views : 324

Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై ప్రధానంగా చర్చ నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు నిర్మలకు ఆహ్వానం రాష్ట్రంలో అంత్యోదయ పథకాల అమలు గురించి కూడా వివరణ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ హాజరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా... నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన ప్రతిష్ఠాత్మక పెట్టుబడుల సదస్సుపై చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 'రైజింగ్ ఏపీ' (RISING AP) థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కుదిరిన ఒప్పందాల గురించి తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్మలా సీతారామన్‌ను ఆయన ఆహ్వానించారు. పెట్టుబడుల సదస్సుతో పాటు, రాష్ట్రంలో అమలవుతున్న అంత్యోదయ సంక్షేమ పథకాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న కార్యక్రమాల తీరును, వాటికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :