Monday, 17 March 2025 11:45:57 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

Chandrababu: దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం: సీఎం చంద్రబాబు

Date : 13 August 2024 11:45 AM Views : 61

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల అభివృద్ధిలో దేశంలోని టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడాలన్న లక్ష్యంతో, కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 15 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించడమే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్, అధికారులతో కలిసి 2024-29 కాలానికి సంబంధించి కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం ముసాయిదా పై చంద్రబాబు నాయుడుకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, 2014-19 కాలంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధిలో పొందిన బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి పొందేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, మౌలిక సదుపాయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని, పరిశ్రమలకు సత్వర అనుమతులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో, పరిశ్రమలు ఏర్పాటుకు ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన వివరించారు. తూర్పు తీర ప్రాంతం పశ్చిమ తీరంతో పోలిస్తే మెరుగైన రీతిలో రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానం కలిగి ఉందనీ, నదుల అనుసంధానం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నెల 16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం జరుపుతామని, ఈ నెల 23న మరోసారి నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై చర్చించనున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మొదట, రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, 2024-29 పారిశ్రామికాభివృద్ధి విధానం ముసాయిదాలో పొందుపర్చిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :