Sunday, 08 March 2026 10:15:35 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద కొనసాగుతున్న హైడ్రామా.. అక్కడే నిద్రించిన భార్యాబిడ్డలు

Date : 11 August 2024 12:11 PM Views : 332

Studio18 News - ANDHRA PRADESH / : Duvvada Srinivas Family Issue : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ దుమారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య వాణి పరస్పర ఆరోపణలతో ఇంటిగుట్టు రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో ఉంటున్నాడని అతని భార్య వాణి, వారి కుమార్తె హైందవి ఆరోపిస్తున్నారు. దీంతో శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. రెండు రోజులుగా కార్యాలయం వద్ద ఆరుబయటనే హాణి, హైందవీలు టెంటు వేసుకొని నిద్రిస్తున్నారు. తమ కార్యాలయంలో దువ్వాడ శ్రీను మరో మహిళతో కలిసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడని దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలిలో తమ పరువుకు భంగం కలిగే చర్యలు మానుకోవాలని, అనైతిక చర్యలకు పాల్పడుతున్న దువ్వాడను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని వాణి డిమాండ్ చేసింది. నా భార్య దువ్వాడ వాణి వెనుకాల మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నాడని, అచ్చెన్నాయుడు కుట్రలో భాగంగానే వాణి, కూతురు హైందవిలు తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుటే వాణి, హైందవీలు నిరసన తెలుపుతుండటంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇరువర్గాలపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. డైవర్స్ నోటీసు ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతుండగా.. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి స్పష్టం చేసింది. దివ్వెల మాధురిని ఇంటి నుంచి బయటకు పంపించాలని శ్రీనివాస్ ను వాణి డిమాండ్ చేస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :