Saturday, 17 January 2026 09:20:32 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Heavy Rains : విజయవాడలో కుండపోత వర్షం.. బయటకు రావొద్దంటూ ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

Date : 31 August 2024 01:39 PM Views : 291

Studio18 News - ANDHRA PRADESH / : Heavy Rains In Vijayawada : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. భారీ వర్షం కారణంగా నగరవాసులకు పోలీసులు కీలక సూచన చేశారు. ద్విచక్ర వాహనదారులు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వీవీఐపీలు బయటకు రావొద్దని సూచించారు. ఎడతెరిపిలేని వర్షంతో నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు ప్రధాన రహదారుల్లో మోకాళ్ల మేర లోతు వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లలోకి వాహనాల మళ్లిస్తున్నారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మళ్లిస్తున్నారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై, బెంజ్ సర్కిల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీళ్ళు చేరింది. నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం దారి మళ్లిస్తున్నారు. ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని స్థానిక అధికారులకు సూచనలు చేశారు. భారీ వర్షం కారణంగా మొఘల్ రాజ్ పురంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి బండరాళ్లు దొర్లడంతో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా.. ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు బండరాళ్ల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫైర్ ఇంజన్లతో నీళ్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాతబస్తీలో ఔట్ ఫాల్ డ్రెయిన్ పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది. నిడమానూరు నుంచి టంకసాల వరకు జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగింది. ఎన్‌టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి అవసరం మేరకు సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు. రెవెన్యూ, విద్యుత్తు, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, రహదారులు అండ్ భవనాలు తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల విజ్ఞప్తి మేరకు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు 0866-2575833 నంబర్ కి ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చునని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :