Monday, 23 June 2025 02:50:54 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

#chittoor : ప్రభుత్వ లాంఛనాలతో అమర జవాన్ అంత్యక్రియలు

Date : 24 January 2025 12:29 AM Views : 165

Studio18 News - ANDHRA PRADESH / Chittoor : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి వీర మరణం పొందిన కార్తీక్‌ యాదవ్‌ అంత్యక్రియలు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానిపెంటలో నిర్వహించారు. మధ్యాహ్నం 3.45 గంలలకు ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు జవాను అంతిమ యాత్రను ఎగువ రాగిమానిపెంట గ్రామ వీధుల గుండా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటితో అమర జవానుకు తుది వీడ్కోలు పలికారు. జవాను అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు కె.మురళి మోహన్‌, గురజాల జగన్మోహన్‌, చిత్తూరు నగర మేయర్‌ అముద, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలమనేరు ఆర్‌డిఒ భవాని, బంగారుపాళ్యం తహశీల్దార్‌ బాబు రాజేంద్రప్రసాద్‌, 4/8 గుర్ఖా రైఫిల్‌ బెటాలియన్‌ లెఫ్టినెంట్‌ శివరాజ్‌ సింగ్‌ గిల్‌ పాల్గొని నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో ఆర్మీ సిబ్బంది, పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. పదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన కార్తీక్‌ యాదవ్‌ రాజస్థాన్‌ ఆర్మ్‌డ్‌ రెజిమెంట్‌లో ఏడేళ్లపాటు పని చేశారు. రెండేళ్ల క్రితం జమ్మూకు బదిలీ అయ్యారు. జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు. కార్తీక్‌ మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, మంత్రి నారా లోకేష్‌, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వీరజవాన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :