Sunday, 08 March 2026 03:45:13 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Keshineni Chinni: లోకేశ్ రెడ్‌బుక్ ఓపెన్ చేయకూడదని వైసీపీ కోరుకుంటోంది: ఎంపీ కేశినేని చిన్ని

Date : 27 July 2024 01:11 PM Views : 465

Studio18 News - ANDHRA PRADESH / : మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్‌ను ఓపెన్ చేయకూడదని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రెడ్ బుక్ అంటే చాలు... వైసీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ ఆరోపించారని... వివరాలు అడిగితే పారిపోయారని విమర్శించారు. రాష్ట్రంపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. విజయవాడ నుంచి అన్ని నగరాలకు త్వరలో ఎయిర్ కనెక్టివిటీ రానుందన్నారు. ఇందుకు అనుగుణంగా కొత్త టెర్మినల్ ఏడాదిలోపే పూర్తి కానుందన్నారు. విజయవాడ మహానాడు సెంటర్ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి గడ్కరీ అంగీకరించినట్లు చెప్పారు. ఐదు నెలల్లో విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. అమరావతికి పావుగంటలో చేరుకునేలా పశ్చిమ బైపాస్‌లో రేడియల్ రోడ్లను అనుసంధానం చేస్తామన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా విజయవాడ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :