Sunday, 08 March 2026 04:43:25 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి సందేహాలు

Date : 07 September 2024 02:47 PM Views : 431

Studio18 News - ANDHRA PRADESH / : వరదలో కొట్టుకువచ్చిన బోట్లు ఇటీవల ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఒకదాని వెనక మరొకటిగా మొత్తం నాలుగు బోట్లు వేగంగా వచ్చి బ్యారేజీ గేట్లను ఢీ కొట్టాయి. దీంతో బ్యారేజీలో 67, 69 నెంబరు గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా వరదలో కొట్టుకు వచ్చిన నాలుగు బోట్లు కూడా ఒకే రంగులో ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీని బోట్లతో డ్యామేజ్ చేయాలని చూశారని ఆరోపించారు. ఒకే రంగులో ఒకే రకమైన బోట్లు కొట్టుకురావడం వెనక కుట్ర ఉందన్నారు. అధికారులు ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించారని వివరించారు. ఒకవేళ ఈ ఘటన వెనక కుట్ర ఉందని తేలితే మాత్రం కారకులు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పండగపూట కూడా ప్రజల్లోనే సీఎం... తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వినాయక చవితి పండగ ఘనంగా జరుపుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అలాంటి పండగ రోజు కూడా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మధ్యే ఉన్నారని తెలిపారు. వరదలతో సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న జనాలకు భరోసా కల్పిస్తూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని గుర్తుచేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ చంద్రబాబుతో పాటు ప్రభుత్వం మొత్తం ప్రజలతోనే ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :