Monday, 23 June 2025 02:17:07 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

నటి జెత్వానీ కేసు.. ఆ ఐపీఎస్ ఆఫీసర్లకు కొత్త గుబులు..!

Date : 04 October 2024 10:27 AM Views : 109

Studio18 News - ANDHRA PRADESH / : Kadambari Jethwani Case : ప్రభుత్వాలు వస్తుంటాయ్‌..పోతుంటాయ్. ఆఫీసర్లే పర్మినెంట్. ప్రతి పనికో లెక్క.. తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాకోణం ఉంటేనే గుర్తింపు ఉంటుంది. కాదు కూడదని.. ఇష్టం వచ్చినట్లు బిహేవ్‌ చేస్తే ఎప్పుడో ఓ రోజు పాపం పండుతుంది. ఉచ్చుబిగిస్తే అంతే సంగతులు. ఎంటైర్ కెరీర్‌లో సంపాదించుకున్న పేరు..చిన్న ఇష్యూతో ఢమాల్‌ అంటుంది. ఇప్పుడిదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు కొందరు అధికారులు. ఏపీలో వివాదంగా మారిన ఓ హీరోయిన్‌ కేసు ఇప్పుడు CID చేతికి వెళ్లబోతుందట. ఇప్పటికే బెయిల్‌ కోసం ఫైట్ చేస్తున్న ఆ ఆఫీసర్లకు..సీఐడీ గుబులు వెంటాడుతోందట. ఆ నటి కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా.? ఇంకొందరు ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ మెడకు చుట్టుకోబోతోందా.? ఈ ఎపిసోడ్‌లో మాజీ డీజీపీ పేరు ఎందుకు తెరమీదకు వస్తోంది.? పవర్‌లో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది. అనుకున్నోడి మీద కేసు పెట్టొచ్చు. తప్పు చేయనోన్ని కూడా ఇరకాటంలో పడేయొచ్చు. పర్మిషన్లు, చట్టాలు ఇవేవి అడ్డురావు. అందుకే అధికారం ఇచ్చే కిక్కే వేరు. అలాగని సమయం కలసి రాకపోతే అరాచకానికి మూల్యం చెల్లించుకోక కూడా తప్పదు. పవర్‌ చేతిలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేశారు. ప్రభుత్వం మారింది. పాపాల చిట్ట బయటపడుతుంది. ఒకటా రెండా..స్యాండ్‌, మైన్‌, వైన్‌..చెప్పుకుంటూ పోతే పెద్ద కథే ఉంది. అంతేకాదు ఓ హీరోయిన్ కేసు కూడా కొందరు అధికారుల మెడకు చుట్టుకుంది. రేపోమాపో ముంబై నటి జత్వానీ కేసును సీఐడీకి ఇవ్వబోతున్నారట. దీంతో ఉన్న హెడెక్‌ చాలదని..ఇప్పుడు కొత్త లొల్లి వచ్చిపడబోతుందని పిసుక్కుంటున్నారట ఆ అధికారులు. మాకేం తెలియదని వాళ్లు.. మీ వెనక ఉన్నదెవరో చెప్పాలని పోలీసులు దీంతో రోజురోజుకు కేసు జఠిలం అవుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే హీరోయిన్‌ కేసులో ఆ అధికారులకు ముప్పుతిప్పలు తప్పేలా లేవు. ముంబై నటి జెత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి ఇస్తూ రేపోమాపో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వం వర్గాలు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ IPSలు PSR ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్ని సస్పెండ్‌ అయ్యారు. మరికొందరు పోలీసు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నలుగురు పోలీసులతో పాటు సీనియర్ IPS అధికారులు, మరో న్యాయవాది బెయిల్‌ కోసం హైకోర్టుకెళ్లారు. అయితే ఇంకో సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉందన్న ఆరోపణలతో ఈ కేసును APCIDకి అప్పగించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. ముగ్గురు అధికారుల సస్పెన్షన్, వారి మీద నమోదైన కేసులు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లోకి మరో కొత్త కేరక్టర్‌ ఎంటరైందని అంటున్నారు. సీనియర్‌ IPSల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి పేరు కూడా తెరపైకి రావడం సంచలనం అవుతోంది. జెత్వానీ కేసులో నేరుగా నాటి డీజీపీ పేరు లేకున్నా.. పరోక్షంగా ఆయన వ్యవహారశైలిపైనే అధికార వర్గాల్లో చర్చ జరుగుతోందట. డీజీపీగా, స్టేట్‌ పోలీస్‌ బాస్‌గా ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందో తెలిసి కూడా రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆపలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐడీ ఎంక్వైరీ స్టార్ట్‌ అయితే..మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి నోటీసులు ఇస్తారని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌సైడ్‌ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ కేసులో సస్పెండ్‌ అయిన ఐపీఎస్‌ ఆఫీసర్లు PSR ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్‌ గున్నిలపై గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా..? అనే కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అందరికంటే ఎక్కువగా PSR ఆంజనేయులు మెడకు APPSCలో జరిగిన వ్యవహారాలు చుట్టుకోబోతున్నట్టు టాక్‌. గ్రూప్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు.. వాల్యూయేషన్‌లో రకరకాల పద్దతులను ఫాలో అయ్యారనే అభియోగాలను తెరమీదకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించడంతో పాటు.. అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్దం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాష్ట్ర పోలీస్‌ వర్గాలు. ఇదే జరిగితే PSR మరిన్ని కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని అంటున్నారు. ఇలా జెత్వానీ కేసు కొత్త పుంతలు తొక్కబోతోంది. ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో, ఏయే మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :