Sunday, 08 February 2026 12:21:13 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

నటి జెత్వానీ కేసు.. ఆ ఐపీఎస్ ఆఫీసర్లకు కొత్త గుబులు..!

Date : 04 October 2024 10:27 AM Views : 418

Studio18 News - ANDHRA PRADESH / : Kadambari Jethwani Case : ప్రభుత్వాలు వస్తుంటాయ్‌..పోతుంటాయ్. ఆఫీసర్లే పర్మినెంట్. ప్రతి పనికో లెక్క.. తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాకోణం ఉంటేనే గుర్తింపు ఉంటుంది. కాదు కూడదని.. ఇష్టం వచ్చినట్లు బిహేవ్‌ చేస్తే ఎప్పుడో ఓ రోజు పాపం పండుతుంది. ఉచ్చుబిగిస్తే అంతే సంగతులు. ఎంటైర్ కెరీర్‌లో సంపాదించుకున్న పేరు..చిన్న ఇష్యూతో ఢమాల్‌ అంటుంది. ఇప్పుడిదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు కొందరు అధికారులు. ఏపీలో వివాదంగా మారిన ఓ హీరోయిన్‌ కేసు ఇప్పుడు CID చేతికి వెళ్లబోతుందట. ఇప్పటికే బెయిల్‌ కోసం ఫైట్ చేస్తున్న ఆ ఆఫీసర్లకు..సీఐడీ గుబులు వెంటాడుతోందట. ఆ నటి కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా.? ఇంకొందరు ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ మెడకు చుట్టుకోబోతోందా.? ఈ ఎపిసోడ్‌లో మాజీ డీజీపీ పేరు ఎందుకు తెరమీదకు వస్తోంది.? పవర్‌లో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది. అనుకున్నోడి మీద కేసు పెట్టొచ్చు. తప్పు చేయనోన్ని కూడా ఇరకాటంలో పడేయొచ్చు. పర్మిషన్లు, చట్టాలు ఇవేవి అడ్డురావు. అందుకే అధికారం ఇచ్చే కిక్కే వేరు. అలాగని సమయం కలసి రాకపోతే అరాచకానికి మూల్యం చెల్లించుకోక కూడా తప్పదు. పవర్‌ చేతిలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేశారు. ప్రభుత్వం మారింది. పాపాల చిట్ట బయటపడుతుంది. ఒకటా రెండా..స్యాండ్‌, మైన్‌, వైన్‌..చెప్పుకుంటూ పోతే పెద్ద కథే ఉంది. అంతేకాదు ఓ హీరోయిన్ కేసు కూడా కొందరు అధికారుల మెడకు చుట్టుకుంది. రేపోమాపో ముంబై నటి జత్వానీ కేసును సీఐడీకి ఇవ్వబోతున్నారట. దీంతో ఉన్న హెడెక్‌ చాలదని..ఇప్పుడు కొత్త లొల్లి వచ్చిపడబోతుందని పిసుక్కుంటున్నారట ఆ అధికారులు. మాకేం తెలియదని వాళ్లు.. మీ వెనక ఉన్నదెవరో చెప్పాలని పోలీసులు దీంతో రోజురోజుకు కేసు జఠిలం అవుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే హీరోయిన్‌ కేసులో ఆ అధికారులకు ముప్పుతిప్పలు తప్పేలా లేవు. ముంబై నటి జెత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి ఇస్తూ రేపోమాపో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వం వర్గాలు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ IPSలు PSR ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్ని సస్పెండ్‌ అయ్యారు. మరికొందరు పోలీసు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నలుగురు పోలీసులతో పాటు సీనియర్ IPS అధికారులు, మరో న్యాయవాది బెయిల్‌ కోసం హైకోర్టుకెళ్లారు. అయితే ఇంకో సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉందన్న ఆరోపణలతో ఈ కేసును APCIDకి అప్పగించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. ముగ్గురు అధికారుల సస్పెన్షన్, వారి మీద నమోదైన కేసులు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లోకి మరో కొత్త కేరక్టర్‌ ఎంటరైందని అంటున్నారు. సీనియర్‌ IPSల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి పేరు కూడా తెరపైకి రావడం సంచలనం అవుతోంది. జెత్వానీ కేసులో నేరుగా నాటి డీజీపీ పేరు లేకున్నా.. పరోక్షంగా ఆయన వ్యవహారశైలిపైనే అధికార వర్గాల్లో చర్చ జరుగుతోందట. డీజీపీగా, స్టేట్‌ పోలీస్‌ బాస్‌గా ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందో తెలిసి కూడా రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆపలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐడీ ఎంక్వైరీ స్టార్ట్‌ అయితే..మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి నోటీసులు ఇస్తారని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌సైడ్‌ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ కేసులో సస్పెండ్‌ అయిన ఐపీఎస్‌ ఆఫీసర్లు PSR ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్‌ గున్నిలపై గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా..? అనే కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అందరికంటే ఎక్కువగా PSR ఆంజనేయులు మెడకు APPSCలో జరిగిన వ్యవహారాలు చుట్టుకోబోతున్నట్టు టాక్‌. గ్రూప్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు.. వాల్యూయేషన్‌లో రకరకాల పద్దతులను ఫాలో అయ్యారనే అభియోగాలను తెరమీదకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించడంతో పాటు.. అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్దం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాష్ట్ర పోలీస్‌ వర్గాలు. ఇదే జరిగితే PSR మరిన్ని కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని అంటున్నారు. ఇలా జెత్వానీ కేసు కొత్త పుంతలు తొక్కబోతోంది. ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో, ఏయే మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :