Thursday, 22 May 2025 02:49:57 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Mandipalli Ramprasad Reddy: నందిగం సురేశ్ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధుడా... పరామర్శకు జగన్ రావడం సిగ్గుచేటు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Date : 11 September 2024 05:33 PM Views : 124

Studio18 News - ANDHRA PRADESH / : టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ గుంటూరు జైల్లో పరామర్శించడం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నందిగం సురేశ్ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధుడా... అతడిని పరామర్శించేందుకు జగన్ రావడం సిగ్గుచేటు అని విమర్శించారు. వరదలు పోటెత్తి ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని జగన్ రెడ్డి... రెండు ఘటనల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నాడంటూ మండిపడ్డారు. వేల కోట్లు ఆస్తులు ఉన్నా వరద బాధితులకు ఒక్క రూపాయి సాయం చేయకపోగా... నిందితుడిగా ఉన్న వ్యక్తిని పరామర్శించేందుకు వచ్చి సూపర్ సిక్స్ పథకాలపై విషం చిమ్మిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేశ్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీనే అని, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో ముఖ్య పాత్ర వహించిన నేతల్లో నందిగం సురేశ్ ఒకరని మండిపల్లి ఆరోపించారు. ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టడంలోనూ నందిగం హస్తం ఉందని అన్నారు. "ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందిస్తున్న బ్యారేజ్ ను ధ్వంసం చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నారు. జగన్ రెడ్డికి అసలు సిగ్గూ శరం లేదు... లక్షలాది మంది ప్రజలు ఆకలి కేకలితో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా బెంగళూరు వెళ్లి మళ్లీ సిగ్గులేకుండా వచ్చి నేడు మాట్లాడుతున్నారు. ప్రజలపై మమకారం ఉంటే ఒక్క రూపాయి అయినా ఇచ్చారా... చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు అనేక సంస్థలు కోట్ల రూపాయలు ఇచ్చాయి" అని మండిపల్లి వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :