Wednesday, 25 June 2025 07:52:37 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

విజయసాయి ముఠాపై సమగ్ర విచారణ జరిపించాలి: సోమిరెడ్డి

జెన్ కోకు 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గు అమ్మారన్న సోమిరెడ్డి నాసిరకం బొగ్గు వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని విమర్శ సీఐడీ, విజిలెన్స్ ఎందుకు చర్యలు

Date : 23 December 2024 03:04 PM Views : 194

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి ముఠా చేయని కుంభకోణం లేదని ఆయన అన్నారు. ఏపీ జెన్ కోకు విజయసాయి అనుబంధ సంస్థ ట్రైడెంట్ నాలెడ్జ్ కంపెనీ 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును అమ్మిందని... ఒక టన్ను బొగ్గును రూ. 8,500 కోట్లకు విక్రయించారని తెలిపారు. నాసిరకం బొగ్గు వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని... దీని కారణంగా ఎక్కువ ధరకు బయట సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేశారని... దీంతో ప్రజలపై భారీగా భారం పడిందని చెప్పారు. ట్రైడెంట్ నాలెడ్జ్ కంపెనీ సరఫరా చేసిన నాసిరకం బొగ్గు సరఫరాపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సీఐడీ, విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదని ప్రశ్నించారు. విజయసాయి ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. 108, 104 కుంభకోణాలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కుంభకోణాలపై చర్యలకు వివిధ శాఖలకు చెందిన సిబ్బంది సరిపోవడం లేదని అన్నారు.

Also Read : రోడ్డు నాణ్యతను స్వయంగా పరిశీలించిన పవన్ కల్యాణ్...

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :