Sunday, 08 March 2026 10:38:24 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Chandrababu Naidu: 15 నెలల్లోనే చెప్పింది చేశాం.. చేసి చూపిస్తున్నాం: అనంతపురం సభలో కూటమి నేతలు

Date : 10 September 2025 06:33 PM Views : 147

Studio18 News - ANDHRA PRADESH / Anantpur : అనంతపురంలో 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పేరుతో భారీ బహిరంగ సభ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే హామీలు నెరవేర్చామన్న కూటమి నేతలు పెన్షన్‌ను రూ.4 వేలకు, వికలాంగులకు రూ.15 వేలకు పెంచిన వైనం వెల్లడి ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ నిర్ణయం రాష్ట్రంలో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ప్రకటన గత వైసీపీ ప్రభుత్వంపై నేతల తీవ్ర విమర్శలు అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల వ్యవధిలోనే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేసి చూపించామని కూటమి ప్రభుత్వ నేతలు స్పష్టం చేశారు. అనంతపురంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' బహిరంగ సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. చెప్పిన హామీలతో పాటు చెప్పని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్ పెంచాం: గోరంట్ల మోహన్ సాయి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచిందని, వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000 నుంచి రూ.15,000కు పెంచిందని బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ సాయి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో అమరావతితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా: కదిరి ఎమ్మెల్యే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయించడం చరిత్రాత్మకమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 3,000కు పైగా చికిత్సలను 2493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారని, పాత్రికేయులకు కూడా వర్తింపజేశారని తెలిపారు. ఏపీకి నలుగురు నాలుగు స్తంభాలు: జేసీ అస్మిత్ రెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ రాష్ట్రానికి నాలుగు స్తంభాల్లా నిలబడ్డారని అభివర్ణించారు. వారి వల్లే రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా ఉందని అన్నారు. 15 నెలల్లోనే రాష్ట్రానికి రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, 11 లక్షల ఉద్యోగాల కల్పనకు బాటలు వేశామని, డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను, 6100 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, 'తల్లికి వందనం', 'దీపం-2', 'ఆడబిడ్డ నిధి' వంటి పథకాలతో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి గండికోట రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కార్గో ఎయిర్‌పోర్ట్ వంటి వాటికి నిధులు కేటాయించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :