Friday, 14 November 2025 03:02:57 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Janasena: టీడీపీ బాటలో జనసేన.. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేటి నుండి వినతుల స్వీకరణ

Date : 01 August 2024 01:01 PM Views : 347

Studio18 News - ANDHRA PRADESH / : టీడీపీ బాటలో జనసేన కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. నేటి (ఆగస్టు 1) నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం చేపడుతుంది. ఎన్నికలకు ముందు జనసేన పార్టీ .. జనవాణి – జనసేన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించే కార్యక్రమాన్ని ఆరంభించారు. ఇందులో భాగంగా నిత్యం ఒక మంత్రి, పార్టీకి సంబంధించి నాయకుడు .. ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వారి వారి సమస్యలపై వినతులను స్వీకరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి విచ్చేసి అర్జీలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా ఆగస్టు 1వ తేదీ (గురువారం) నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాసమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించాలని నిర్ణయించింది. జనసేనాని ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఒక్కో ప్రజాప్రతినిధి విధిగా రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజలు, పార్టీ శ్రేణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేల షెడ్యూల్ వివరాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకూ షెడ్యూల్ ను విడుదల చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :