Monday, 28 April 2025 05:42:35 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం.. గత ప్రభుత్వంలో ఐటీ కంపెనీల్లో వాటాలు అడిగారు: నారా లోకేశ్

వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదన్న లోకేశ్ ఐటీ కంపెనీల్లో వాటాలు అడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపాటు ఇలా అయితే రాష్ట్రానిక

Date : 21 November 2024 01:18 PM Views : 115

Studio18 News - ANDHRA PRADESH / : ఐదేళ్లలో ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 150 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి పెట్టామని... భూములు కేటాయించి పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీని తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా ఆగిపోయిందని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఒక్క కాంక్లేవ్ కూడా జరగలేదని... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని లోకేశ్ విమర్శించారు. గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగిందని... అలాంటి రేస్ ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు... అప్పటి మంత్రి కోడి.. గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోజు నుంచి ఐటీ మంత్రి ఇలా ఉంటారా? అని ఏపీకి అవమానం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను పలు కంపెనీలను కలిశానని... గత ప్రభుత్వంలో వాటాలు అడిగారని వారు చెప్పారని లోకేశ్ తెలిపారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాము ఐటీ కంపెనీలతో సమావేశమయ్యామని... వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. చంద్రబాబు చొరవ కారణంగా ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువాళ్లు కనిపిస్తున్నారని... ఇది మనకు గర్వకారణమని అన్నారు.

Also Read : ఉరేసుకున్న మహిళను సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :