Saturday, 07 March 2026 08:09:12 PM
# అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

భూమి పూజ వేళ ఎల్జీ ప్రతినిధుల సంస్కారం... లోకేశ్ విజ్ఞప్తితో షూ తీసేసిన కొరియన్లు

Date : 08 May 2025 07:41 PM Views : 282

Studio18 News - ANDHRA PRADESH / : ఇవాళ శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఏపీ ఎలక్ట్రానిక్స్, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్, ఎల్జీ ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమం భారతీయ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భూమి పూజ స్థలికి విచ్చేసిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కొరియన్ ప్రతినిధులు పాదరక్షలతోనే కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిని గమనించిన మంత్రి నారా లోకేశ్, భారతీయ పూజా కార్యక్రమాలలో పాదరక్షలు ధరించరాదనే సంప్రదాయాన్ని వారికి సున్నితంగా వివరించారు. పూజలో పాల్గొనేటప్పుడు పాదరక్షలు తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేశ్ సూచనను ఎల్జీ ప్రతినిధులు తక్షణమే గౌరవించారు. వారంతా తమ పాదరక్షలను విడిచిపెట్టి, నేలపై కూర్చుని శ్రద్ధాసక్తులతో భూమి పూజలో పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి, ఇతర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. విదేశీయులు భారతీయ సంప్రదాయాలను అర్థం చేసుకుని, వాటిని పాటించడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. మంత్రి లోకేశ్ చొరవ, కొరియన్ ప్రతినిధుల సంస్కారయుత ప్రవర్తన ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చాయి. కాగా, సుమారు రూ.5000 కోట్ల భారీ పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్, శ్రీ సిటీలో తమ ఉత్పాదక కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యాక, దేశీయ మార్కెట్‌లోని 70 శాతం ఎయిర్ కండిషనర్ల (ఏసీ) అవసరాలను ఇక్కడి నుంచే తీర్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :