Wednesday, 30 April 2025 04:27:34 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Chandrababu: ఆధారాలు మాయం చేయడంలో వారు సిద్ధహస్తులు: మదనపల్లె ఘటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్య

Date : 23 July 2024 10:46 AM Views : 106

Studio18 News - ANDHRA PRADESH / : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాలు దహనమైన ఘటన ప్రమాదమా? కుట్రపూరితమా? అన్నది తేల్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పత్రాలు దహనమైన తీరు చూస్తుంటే మానవ ప్రమేయంతో... కుట్రపూరితంగా జరిగినట్లుగా కనిపిస్తోందన్నారు. సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలు పని చేయడం లేదని గుర్తు చేశారు. దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు కూడా పూర్తిగా కాలిపోయినట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా కూడా కనిపించడం లేదన్నారు. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇది జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆధారాలు మాయం చేయడంలో సిద్దహస్తులు మనకంటే ముందు అధికారంలో ఉన్నవారు... నేరాలకు పాల్పడి ఆధారాలు మాయం చేయడంలో సిద్ధహస్తులు అన్నారు. ఈ కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సూచించారు. విచారణ జరిపి అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తన ముందు ఉంచాలని ఆదేశించారు. అసైన్డ్ భూములు, 22ఏ జాబితాలోని భూములు, వివాదాస్పద భూములు, హైవే ప్రాజెక్టుల భూసేకరణ సంబంధిత డాక్యుమెంట్లు దహనమైనట్లుగా ప్రాథమిక సమాచారం ఉందన్నారు. అధికారులకు హెచ్చరిక నేరం జరిగిన సమయంలో సత్వరం స్పందించాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అధికారుల పనితీరులో మార్పు రావాలన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరు అధికారులు, ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనం అన్నారు. ఇలాంటి విషయాల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటలకు జరిగితే వెంటనే ఎందుకు స్పందించలేదని కలెక్టర్ శ్రీధర్‌కు ఫోన్ చేసి అడిగారు. ఆదివారం రాత్రి పదిన్నర వరకు గౌతమ్ అనే ఉద్యోగి అక్కడే ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. అయితే సెలవు రోజు కూడా అతను కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో తెలియాలన్నారు. ఆధారాల సేకరణలోనూ జాప్యం జరిగిందన్నారు. సోమవారం ఉదయం నుంచి ఏం విచారణ జరిపారని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆ ప్రాంతంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, కాల్ డేటా సేకరించాలని ఆదేశించారు. గతంలో అక్కడ పని చేసిన అధికారులను విచారించాలన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :