Monday, 24 March 2025 06:04:25 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

ఎమ్మెల్యేగా గెలిచినా దక్కని సంతోషం..! ఆ ఇద్దరు వైసీపీ నేతలకు ఏమైంది?

Date : 10 September 2024 11:41 AM Views : 62

Studio18 News - ANDHRA PRADESH / : Gossip Garage : వైసీపీలో ఓడిన నేతలది ఓ కథ అయితే… గెలిచిన నేతలదీ మరో వ్యథ…. 12 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఇప్పుడు గెలిచిన 11 మందిలో కొత్తగా గెలిచిన వారు ముగ్గురు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు.. ఇక అనుభవం లేక…. పార్టీపరంగా సలహాలు సూచనలిచ్చే వారు కనిపించక ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విలవిల్లాడిపోతున్నారట. తమ నియోజకవర్గాల్లో ఓడిన కూటమి నేతలే చక్రం తిప్పుతుండటంతో వారిని అడ్డుకోలేక, ఎదిరించి తమ సత్తా చాటలేక సతమతమవుతున్నారట… అధికార కూటమిపై పైచేయి సాధించడానికి ఆపసోపాలు పడుతున్న ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? మార్గనిర్దేశం చేసే లీడర్‌ కనిపించక విలవిల.. విశాఖ ఏజెన్సీలో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు దిక్కులేక బిక్కుబిక్కు మంటున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో లేకపోవడం, ఉమ్మడి జిల్లాలో సైతం సరైన మార్గనిర్దేశం చేసే లీడర్‌ కనిపించకపోవడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విలవిలలాడుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచినా సరే ప్రజలకు ఏ పని చేయాలో, ఆ పనిని అధికారులతో చేయించుకోవడంపై అవగాహన లేక అయోమయంలో ఉన్నారు. వీరిలో ఒకరు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, మరొకరు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం. ఎమ్మెల్యేలుగా వారిని అడ్డుకోవడం సవాల్‌.. వీరిద్దరు ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ, శాసన సభ్యులుగా పని చేసే అవకాశం రాలేదు. అయితే జిల్లా వ్యాప్తంగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా, ఏజెన్సీలోని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం మంచి మెజార్టీతో గెలిచారు. ఐతే వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఈ ఇద్దరిని ప్రభుత్వంలో పట్టించుకున్న వారే లేకపోయారు. ఇక ప్రతిపక్షంగా పోరాడదామన్నా పరిమిత వనరులతో ముందుకు వెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు. పాడేరు, అరకులో కూటమి అభ్యర్థులు ఓటమి పాలైనా నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తుండటంతో ఎమ్మెల్యేలుగా వారిని అడ్డుకోవడం సవాల్‌గా మారిందంటున్నారు. పార్టీ పరంగా ఎలాంటి అండదండలు ఉండటం లేదా? పాడేరు ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా, ఎమ్మెల్యేగా తొలిసారే ఎన్నికయ్యారు. ఫలితాలు వచ్చిన దాదాపు మూడు నెలలు అవుతున్నా ఈయన అసలు బయటకు రాలేకపోతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు చురుగ్గా తిరుగుతున్న విశ్వేశ్వరరాజుకు పార్టీ పరంగా ఎలాంటి అండదండలు ఉండటం లేదని అంటున్నారు. దీంతో ప్రజా సమస్యలపై పోరాడలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీపరంగా విశ్వేశ్వరరాజుకు పెద్దగా సమాచారం ఇస్తున్నట్లు కనిపించడం లేదంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా కార్యకలాపాల్లో ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజుకు పార్టీ నుంచి పిలుపు ఉండటం లేదని అంటున్నారు. దీంతో ఆయన కూడా ఉన్నామంటే ఉన్నానన్నట్లు తూతూ మంత్రంగా గడిపేస్తున్నారంటున్నారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఉండటం లేదనే విమర్శలు.. ఇక అరకు ఎమ్మెల్యే మత్స్య లింగందీ ఇదే విధమైన స్టోరీ.. ఈయనకు పార్టీ కార్యక్రమాలపై పెద్దగా సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి నేతల నుంచి ఎమ్మెల్యే గట్టి సవాల్‌ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పరంగా ఎమ్మెల్యేకు పెద్దపీట వేయాల్సి వున్నా, కూటమి నేతల డామినేషన్‌తో మత్స్యలింగంను ఏ కార్యక్రమానికి పిలవడం లేదంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలుగా తమ ఉనికి చాటుకోవడమే ఈ ఇద్దరికీ చాలెంజింగ్‌గా మారింది. మరోవైపు టీడీపీకి చెందిన గిడ్డి ఈశ్వరి పాడేరులోను… దున్నుదొర అరుకులోనూ దూసుకుపోతుండటం ఎమ్మెల్యేలను కలవరానికి గురిచేస్తోందంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆ సంతోషం దక్కడం లేదని తమ అనుచరుల వద్ద వాపోతున్నారట ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :