Sunday, 08 March 2026 10:08:28 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Jupudi Prabhakar: సాక్షి కార్యాలయంపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారు: జూపూడి ప్రభాకర్

Date : 02 September 2025 08:15 PM Views : 420

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : డీఎస్పీల ప్రమోషన్లలో అక్రమాలపై వార్త రాసినందుకు వేధిస్తున్నారన్న జూపూడి సాక్షి ఎడిటర్‌పై అక్రమంగా కేసు బనాయించారని మండిపాటు ప్రభుత్వ తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాలరాస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై వార్తలు ప్రచురించినందుకే ‘సాక్షి’ మీడియా కార్యాలయంపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. "పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే, అదే పోలీసులను అర్ధరాత్రి సాక్షి కార్యాలయానికి పంపి వీరంగం సృష్టించారు. వార్తలు రాసినందుకు దాడులు చేస్తారా?" అని జూపూడి ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మొదట వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం, ఇప్పుడు సాక్షి మీడియాను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. "దేశానికి స్వాతంత్ర్యం అర్ధరాత్రి వస్తే, కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్వేచ్ఛను హరించింది" అని ఆయన ధ్వజమెత్తారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేయించారని జూపూడి ఆరోపించారు. గతంలో మే 8న కూడా ఆయన ఇంట్లో అక్రమంగా సోదాలు నిర్వహించారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని అన్నారు. "ప్రభుత్వం వీధి రౌడీలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోం. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయాలని చూస్తే కుదరదు" అని జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :