Wednesday, 25 June 2025 07:04:08 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

సీఎం చంద్రబాబు మాటలకు పగలబడి నవ్విన పవన్ కల్యాణ్..! అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..

Date : 25 July 2024 06:06 PM Views : 193

Studio18 News - ANDHRA PRADESH / : Cm Chandrababu : ఏపీలో అసెంబ్లీలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో వ్యక్తిగతంగా దూషణలు చేశారని, మహిళలను అవమానించారని చంద్రబాబు వాపోయారు. మహిళలను కించపరిచే విధంగా చాలా నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేశారని ధ్వజమెత్తారు. ఇదే సభలో తనను ఎంతగానో అవమానించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ అవమానం తనను వెంటాడుతూనే ఉంటుందన్నారు. జీవితంలో మొట్టమొదటి సారిగా తాను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఒక్కటే ఒక్కటి ఉందని, అది సభలో తనకు జరిగిన అన్యాయం అని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ ను మాజీ సీఎం జగన్ వ్యక్తిగతంగా దూషించారని చెప్పారు. పవన్ ఫ్యామిలీ గురించి పదే పదే మాట్లాడి పవన్ ను విసిగించారని అన్నారు. దాంతో జగన్ కు బుద్ధి వచ్చేలా తాను కూడా ఒక మాట అన్నానని చంద్రబాబు చెప్పారు. నువ్వు ఇన్నిసార్లు పవన్ కల్యాణ్ ను కలవరిస్తున్నావు.. నువ్వు కూడా వెళ్లి కాపురం చెయ్యి అని జగన్ కు చెప్పాను అని చంద్రబాబు అనగానే.. పవన్ కల్యాణ్ పగలబడి నవ్వారు. చంద్రబాబు అన్న ఆ మాటలతో సభలోని నవ్వులు విరబూసాయి. ఇతర సభ్యులు కూడా పగలబడి నవ్వుకున్నారు. ”నాకు జరిగిన అవమానాన్ని జీవితంలో మర్చిపోలేను. నా జీవితంలో తొలిసారి కంటతడి పెట్టా. ఈ హౌస్ లోనే నాకు అన్యాయం జరిగింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ విషయాల పట్ల చాలా విసిగిపోయారు. జగన్ కు బుద్ధి రావాలని నేనూ ఒక మాట అన్నా. పవన్ కల్యాణ్ చట్టపరంగా పెళ్లి చేసుకున్నారు. ఇన్ని సార్లు కలవరిస్తున్నావ్. వెళ్లి పవన్ తో కాపురం చెయ్యవయ్యా అని జగన్ కి చెప్పాను. ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నించా? కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడిగా. మహిళల మనోభావాలను కించపరిచేలా ఎవరూ మాట్లాడొద్దు. మహిళలను కించపరిచే వాళ్లను వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెడతాను. ఆ విషయంలో రాజీపడను. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. ఇన్ని రోజులు వాడు వేధించాడు. నేను కూడా వేధిస్తే మన కార్యకర్తలు తృప్తి పడతారని ఎవరూ అనుకోవద్దు. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వానిది. సేవ చేసే అవకాశం, బాధ్యత మీది. మనం చేసే ప్రతి పనిని 5 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఇలా అన్నీ గమనిస్తున్నారు” అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు చంద్రబాబు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :