Saturday, 07 March 2026 09:06:37 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Ganja: భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు .. అయిదుగురు అరెస్టు

Date : 11 August 2024 11:15 AM Views : 366

Studio18 News - ANDHRA PRADESH / : గంజాయి వినియోగం, అక్రమ రవాణను అరికట్టేందుకు ఏపీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే వాహనాల తనిఖీల్లో గంజాయి పట్టుబడుతోంది. పోలీసులు, సెబ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణాపై కేసులు నమోదు చేస్తున్నా కొందరు అక్రమార్కులు అధికారుల కళ్లు గప్పి రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా, గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు శనివారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుండి తమిళనాడుకు రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సెబ్ అధికారులు మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేశారు. రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వాహనాలను సీజ్ చేశారు. అయిదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ అయిదుగురు వ్యక్తులు గత కొంత కాలంగా విశాఖ నుండి గంజాయి తీసుకొస్తున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :