Friday, 18 July 2025 05:42:46 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

YSRCP: జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్

Date : 08 August 2024 11:23 AM Views : 104

Studio18 News - ANDHRA PRADESH / : విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ (స్థాయి సంఘం) ఎన్నికల్లో వైసీపీకి ఆ పార్టీ నేతలు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని క్యాంప్ రాజకీయలు చేసినప్పటికీ మొత్తం పది స్థానాలలోనూ కూటమి అభ్యర్ధులే విజయం సాధించారు. జీవీఎంసీలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘోర పరాజయం కావడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పోరేటర్ లకు గానూ ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 97 మంది న్నారు. సీపీఎం కార్పోరేటర్ గంగారావు ఓటింగ్ కు దురంగా ఉన్నారు. 96 మంది కార్పోరేటర్ లు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీవిఎంసీలో వైసీపీకి 58 మంది కార్పోరేటర్ లు ఉండగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 37 మంది ఉన్నారు. సీపీఐ, సీపీఎం లకు ఒకొక్కరు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు గానూ గత నెల 22న నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత 11 మంది వైసీపీ కార్పోరేటర్ లు ఆ పార్టీని వీడారు. వీరిలో ఆరుగురు టీడీపీలో, అయిదుగురు జనసేన పార్టీలో చేరారు. దీంతో వైసీపీ బలం 47కి పడిపోయింది. కూటమి బలం 49కి పెరిగింది. బుధవారం పోలింగ్ జరగనుండగా ఒక రోజు ముందు నుంచే తమ తమ కార్పోరేటర్ లను ప్రత్యేక శిబిరాలకు తరలించారు. అయితే వైసీపీ క్యాంప్ నకు నలుగురు కార్పోరేటర్ లు గైర్హాజరయ్యారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపునకు ఒక్కో అభ్యర్ధికి కనీసం 49 ఓట్లు రావాల్సి ఉంది. అయితే వైసీపీలో ఒక్క అభ్యర్ధికి కూడా అన్ని ఓట్లు రాకపోవడంతో అంతా ఓటమి చెందారు. వైసీపీ అభ్యర్ధుల్లో ఒక్కరికి మాత్రమే అత్యధికంగా 42 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో తమ పార్టీ కార్పోరేటర్ లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా వైసీపీ అభ్యర్ధులు ఆవేదన చెందుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :