Sunday, 08 March 2026 09:46:50 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

విజయనగరం జిల్లాలోని ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Date : 26 August 2024 11:06 AM Views : 449

Studio18 News - ANDHRA PRADESH / : Fire Accident : విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని పెనుబాక గ్రామ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న సీతారామ ఆయిల్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో గోదాంలోని సరుకు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక అధికారులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఆయిల్ పరిశ్రమంలో ఎవరూ లేకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రాజాం -చీపురుపల్లి రోడ్ లోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయిల్ కర్మాగారం ఉంది. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. తవుడు నుంచి ఆయిల్ ను తీయగా మిగిలిన ముడిసరుకు అగ్నికి ఆహుతైంది. గోదాంలో సుమారు కోటి విలువైన పశువుల దాణా ఉండగా సగానికిపైగా మంటల్లో కాలిపోయిందని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. భారీగా ఎగిసిపడిన మంటలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. మంటల కారణంగా వేడికి గిడ్డంగి పైభాగంతోపాటు గోడలు దెబ్బతిన్నాయి. రాజాం ఎస్ఐ రవికిరణ్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :