Studio18 News - ANDHRA PRADESH / Guntur : గుంటూరు నగరంలో పిన్ పాయింట్ గా మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్మికులు, కార్యదర్శులు, అధికారులపై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం జేకేసి కాలేజీ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్టీసి కాలనీ, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత బాలాజీ నగర్ లో చెత్త సేకరణపై ప్రజలు ఫిర్యాదు చేయగా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులతో వివరాలు అడిగి తెలుసుకుకన్నారు. అనంతరం మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనుల్లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రంపై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, కార్మికులు పిన్ పాయింట్ గా విధులు నిర్వహించేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. బాలాజీ నగర్ లో పారిశుధ్య పనుల్లో 2 రోజుల్లో మెరుగదల ఉండాలని, చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం చేసే విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్మికులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్ ని ఆదేశించారు. ఆర్టీసి కాలనీ మెయిన్ రోడ్ లో డ్రైన్ ఆక్రమణ చేసి ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని పట్టణ ప్రణాళిక కార్యదర్శులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న ఆవులను జిఎంసి గోశాలకు తరలించాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన బహుళ అంతస్తు భవనాన్ని పరిశీలించి, డ్రైనేజిని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు నూతన రోడ్లను ఎండ్ టు ఎండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణ అనంతరం వ్యర్ధాలను సదరు కాంట్రాక్టరే తొలగించాలన్నారు. పర్యటనలో డిఈఈలు రమేష్ బాబు, కళ్యాణరావు, ఆర్ఓ సాదిక్ భాష, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు
Admin
Studio18 News